నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 08 : రామసముద్రం పోలీస్ స్టేషన్ ను శనివారం సీఐ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్బంగా పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకుని, త్వరగా వాటిని పరిష్కరించాలని ఎస్సై రమేష్ బాబు కు సూచించారు. సిబ్బందితో సమావేశమై విధుల నిర్వహణపై సూచనలు ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భూమికి ధరలు పెరగడంతో భూసమస్యలు ఎక్కువవుతున్నాయని, ఇలాంటి సమస్యలను చట్టపరమైన మార్గంలోనే పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.అదేవిధంగా చిన్నపిల్లలు,మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లితండ్రులపై కేసులు నమోదు చేస్తామని, రోడ్డు ప్రయాణంలో వాహనదారులు తప్పక హెల్మెట్లను ధరించి, రోడ్డు నియమాలను పాటించాలని తెలియజేశారు.ఈ సమావేశంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News