Wednesday, 16 September 2026 12:42:44 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి

మిట్స్‌లో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు

Date : 15 September 2026 10:19 PM Views : 8

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 15 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ASCE) వారి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిరీష బండపల్లి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, పలమనేరు మున్సిపాలిటీ పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథిలు, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్,డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సనత్ హెగ్డే మరియు తదితరులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో శిరీష బండపల్లి మాట్లాడుతూ భారత్‌లో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన భారత రత్న సర్‌. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజు అయిన సెప్టెంబరు 15 ని దేశవ్యాప్తంగా 'ఇంజినీర్స్ డే' గా జరుపుకోవడం గర్వకారణం అని అన్నారు. ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించినవారిలో భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మన మోక్ష గుండం విశ్వేశ్వరయ్య అని, ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు అని అన్నారు. ఇంజనీరింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు అని అన్నారు. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు కేవలం ఉద్యోగం పొందడమే లక్ష్యంగా కాకుండా, తమ సాంకేతిక పరిజ్ఞానంతో సమాజంలోని సమస్యలకు సానుకూల మార్పు తీసుకురావడంపై దృష్టి సారించాలని అన్నారు. పర్యావరణ ఇంజినీరింగ్ ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చే మార్గాలను అన్వేషించవచ్చని, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ ద్వారా ట్రాఫిక్ సమస్యలకు మెరుగైన పరిష్కారాలను అందించవచ్చని అన్నారు. అర్బన్ ప్లానింగ్ ద్వారా పార్కులు, రహదారులు, నీటి వనరులు, ఇతర ప్రజా సౌకర్యాలను సమర్థవంతంగా ప్రణాళిక చేసి మెరుగైన నగరాలను అబివృద్ధి చేయడంలో సివిల్ ఇంజినీర్ల పాత్ర ముఖ్యమైనదని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ నిర్మాణాల భద్రత, స్థిరత్వం, నిర్మాణ సామర్థ్యం, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ వంటి కీలక అంశాల్లో సివిల్ ఇంజినీర్ల నైపుణ్యం ఎప్పటికీ అవసరమేనని అన్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో కోర్ రంగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వేలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మున్సిపల్ పరిపాలన, నీటి వనరులు, రవాణా, పట్టణ ప్రణాళిక, పర్యావరణం, రక్షణ రంగం, పరిశ్రమలు, పరిశోధన, ఉన్నత విద్య వంటి విభిన్న రంగాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడం ద్వారా సివిల్ ఇంజినీర్లు సమాజ అభివృద్ధికి గణనీయమైన సేవలు అందించగలరని, విద్యార్థులు “ఏ ఉద్యోగం వస్తుంది?” అనే ఆలోచనకు బదులుగా “సమాజంలో నేను ఎలాంటి మార్పు తీసుకురాగలను?” అనే దృక్పథంతో తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ విజయకుమార్ నటేశన్, కోఆర్డినేటర్ డాక్టర్ సుధీర్ కుమార్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: