నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట- ఆగస్ట్ 20 : గుడిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మృతి చెందాడు.ఐచర్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో గుడిపల్లికి చెందిన వెంకటేష్ (24) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న బి.కొత్తకోట ఎస్ఐ చిన్న బాలాజీ ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Reporter
Namitha News