నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే01 : తంబళ్లపల్లె మండలంలో వేసవి తాపం దృశ్య సామాజిక పెన్షన్ల పంపిణీ లో సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని ఇన్చార్జి ఎంపీడీవో ఎం వి ప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన చేసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇందులో భాగంగా మండలంలోని పలు పంచాయతీలలో ఆయన తోపాటు అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేపట్టారు. ఈ పెంచర్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల తో పాటు అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News