నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె మండలానికి చెందిన ఓ రైతు ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యానికి దుర్మరణం పాలయ్యాడు. శనివారం జరిగిన ఈ విషాదకర సంఘటన పై కుటుంబీకుల కథనం.. యనమల వారిపల్లికి చెందిన దాసన్న కొడుకు రైతు వై.చంద్రశేఖర్ (56), ఊరికి సమీపంలో ఉన్న తన వ్యవసాయ బోరు వద్దకు పాడి పశువులకు గడ్డి కోసుకు రావడానికి ఉదయం వెళ్ళాడు. అక్కడ నేలపై ఉన్న విద్యుత్ వైర్లకు కరెంటు సరఫరా రావడంతో గడ్డి కోస్తూ, షాక్ గురై రైతు అక్కడి కక్కడే మృత్యువాత పడ్డాడు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Reporter
Namitha News