Thursday, 30 July 2026 11:53:33 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పెంచుపాడులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణను సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, నిసార్ అహ్మద్

Date : 10 July 2026 06:26 PM Views : 95

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెంచుపాడులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణను సమీక్షించిన మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, నిసార్ అహ్మద్ మదనపల్లి మండలం పెంచుపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పాశంవారిపల్లెలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమీక్షించి, బూత్ లెవల్ ఏజెంట్లతో (బీఎల్‌ఏలు) మాట్లాడినట్లు తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమర్థవంతంగా సేవలు అందించాలని కోరారు. గడువు ముగియడానికి నాలుగు రోజులు మాత్రమే ఉన్నందున డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఎస్. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు వంటి అంశాల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రత్యేక సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను స్వయంగా నింపి ప్రజలకు సహకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ వివిధ దరఖాస్తు ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు తొలగింపునకు సంబంధించి ఏదైనా నోటీసు అందితే వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి దండు శేఖర్ రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి కోటూరు ఈశ్వర్, నాయకులు మజ్జిగ కేశవ యాదవ్, కొత్తపల్లి నాగార్జున నాయుడు, బయ్యా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, నల్లచెరువు బాషా, శంకరనాయక్, ఫయాజ్, ఆదినారాయణ, శంకర, శ్రీనివాసులు, సుధాకర, జయరాం తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :