నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 08 : మదనపల్లి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, డ్రగ్స్ దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన డీఎస్పీ బుచ్చి రాజు ర్యాగింగ్ అంటే ఏమిటి, దాని వల్ల విద్యార్థులపై కలిగే మానసిక, శారీరక ప్రభావాలను వివరించారు. అదేవిధంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్కు దూరంగా ఉండటంతో పాటు, ర్యాగింగ్కు పాల్పడకుండా తోటి విద్యార్థులను గౌరవిస్తూ స్నేహపూర్వక వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ర్యాగింగ్, డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని, ఒక్క తప్పు నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుందని హెచ్చరించారు. చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడికను అలవర్చుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని డీఎస్పీ బుచ్చి రాజు పిలుపునిచ్చారు. ర్యాగింగ్, మాదకద్రవ్యాలకు తావులేని విద్యా వాతావరణాన్ని నిర్మించడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం, పోలీసులు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాగింగ్, డ్రగ్స్కు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే కళాశాల యాజమాన్యం లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ బుచ్చి రాజు సూచించారు
Reporter
Namitha News