Sunday, 03 May 2026 09:13:45 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 01 May 2026 07:44 PM Views : 39

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ -మే 01 : శుక్రవారం ఉదయం గుర్రంకొండ మండలంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా లబ్ధిదారులు కె ఎస్ అక్బర్ వల్లి, షేక్ ఖాదర్ భాష, ఎం రహమతుల్లా ఇంటి వద్దకు వెళ్లి కలెక్టర్ చేతుల మీదుగా వృద్ధాప్య పింఛను అందజేశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదును లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి వద్దనే పెన్షన్ అందుతుందా, ఏ రోజు పింఛను అందుతోంది, ఎన్ని గంటల సమయంలో అందుతుంది, ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా వంటి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఏమైనా ఉందా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నది తదితర విషయాలని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి పైప్ లైన్లు డ్రైనేజ్ కాలవలో కలవకుండా లీకేజ్ లేకుండా సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించే విధంగా చూడాలని ఎక్కడ నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :