Friday, 19 June 2026 03:17:33 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 01 May 2026 07:44 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ -మే 01 : శుక్రవారం ఉదయం గుర్రంకొండ మండలంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా లబ్ధిదారులు కె ఎస్ అక్బర్ వల్లి, షేక్ ఖాదర్ భాష, ఎం రహమతుల్లా ఇంటి వద్దకు వెళ్లి కలెక్టర్ చేతుల మీదుగా వృద్ధాప్య పింఛను అందజేశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదును లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి వద్దనే పెన్షన్ అందుతుందా, ఏ రోజు పింఛను అందుతోంది, ఎన్ని గంటల సమయంలో అందుతుంది, ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా వంటి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఏమైనా ఉందా, ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నది తదితర విషయాలని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి పైప్ లైన్లు డ్రైనేజ్ కాలవలో కలవకుండా లీకేజ్ లేకుండా సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించే విధంగా చూడాలని ఎక్కడ నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :