Monday, 08 June 2026 08:31:01 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు

Date : 12 December 2025 10:17 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు బుధవారం(10-12-2025) ఏఐ ఏజ్ క్రాస్ కమ్యూనికేషన్ గ్లోబల్లి అనే అంశంపై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా అసోసియేట్ ప్రొఫెసర్, రేవా యూనివర్సిటీ, బెంగళూరు, డా. అభిసారిక ప్రజాపతి ఏఐ నిపుణులు పాల్గొని ఈ కార్యక్రమనందు కీలక సూచనలు అందించారు. వక్త మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా భాషా అవరోధాలు తొలగిపోతున్నాయని, ఏఐ ఆధారిత ట్రాన్స్లేషన్ సిస్టం, చాట్ బాక్స్లు,వర్చువల్ అసిస్టెంట్లు ప్రపంచాన్ని ఒకే కమ్యూనికేషన్ ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకువస్తున్నాయని వివరించారు. విద్యార్థులు ఈ మారుతున్న సాంకేతిక పరిసరాలను అర్థం చేసుకోవడం గ్లోబల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం భవిష్యత్తులో అత్యంత కీలకమని చెప్పారు.ఈ ప్రస్తుతం టెక్నాలజీ లో ఏఐ యొక్క ప్రాముఖ్యత ఎమోషనల్, కల్చర్, సైకాలజీ, సాఫ్ట్వేర్ మెథడాలజీ గురించి చాలా వివరాలు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెషనల్స్ ఇమెయిల్స్ తయారు చేసి పంపడంలో ఏఐ చాలా కీలక అంశం గా వుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి డా.అభిసారిక ప్రజాపతి ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా. టి. ఎస్. గౌస్ భాషా, డీన్స్ విభాగ అధిపతులు, అధ్యాపకులు మరియు బి. టెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :