నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు బుధవారం(10-12-2025) ఏఐ ఏజ్ క్రాస్ కమ్యూనికేషన్ గ్లోబల్లి అనే అంశంపై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా అసోసియేట్ ప్రొఫెసర్, రేవా యూనివర్సిటీ, బెంగళూరు, డా. అభిసారిక ప్రజాపతి ఏఐ నిపుణులు పాల్గొని ఈ కార్యక్రమనందు కీలక సూచనలు అందించారు. వక్త మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా భాషా అవరోధాలు తొలగిపోతున్నాయని, ఏఐ ఆధారిత ట్రాన్స్లేషన్ సిస్టం, చాట్ బాక్స్లు,వర్చువల్ అసిస్టెంట్లు ప్రపంచాన్ని ఒకే కమ్యూనికేషన్ ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకువస్తున్నాయని వివరించారు. విద్యార్థులు ఈ మారుతున్న సాంకేతిక పరిసరాలను అర్థం చేసుకోవడం గ్లోబల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం భవిష్యత్తులో అత్యంత కీలకమని చెప్పారు.ఈ ప్రస్తుతం టెక్నాలజీ లో ఏఐ యొక్క ప్రాముఖ్యత ఎమోషనల్, కల్చర్, సైకాలజీ, సాఫ్ట్వేర్ మెథడాలజీ గురించి చాలా వివరాలు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెషనల్స్ ఇమెయిల్స్ తయారు చేసి పంపడంలో ఏఐ చాలా కీలక అంశం గా వుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి డా.అభిసారిక ప్రజాపతి ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా. టి. ఎస్. గౌస్ భాషా, డీన్స్ విభాగ అధిపతులు, అధ్యాపకులు మరియు బి. టెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News