నమిత న్యూస్ - Andhra Pradesh / : మదనపల్లి - జూలై 28 : మదనపల్లె పట్టణం వారపు సంత లో ఎర్రగడ్డల వ్యాపారం చేసే యస్.కె.ఏం. ట్రేడర్స్ కరీం బాషా దుకాణంలో చోరీ జరిగిందని ఆరోపిస్తూ ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన తీవ్ర కలకలం గా మారింది. మంగళవారం రాత్రి మదనపల్లి మండలం వేంపల్లె గ్రామానికి చెందిన సి.నాగేంద్ర వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్ ను కరీం బాషా తన సిబ్బందితో కలసి తాళ్లతో కట్టేసి దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు నాగేంద్రను అదుపులోకి తీసుకొని పియస్ కు తరలించారు. దర్యాప్తు లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Reporter
Namitha News