Tuesday, 15 September 2026 09:48:41 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

టిడిపి కేంద్ర కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లును పరిశీలించిన మంత్రులు

పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి క్షేత్రస్థాయిలో అంగరంగ వైభవంగా మహానాడుని నిర్వహిస్తున్నాం - హోం మంత్రి అనిత

Date : 26 May 2026 07:26 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / గుంటూరు : మంగళగిరి - మే 26 : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లను హోం మంత్రి అనిత, మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ..ఈసారి మహానాడు పండుగ హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో మహానాడును హైబ్రిడ్ రూపంలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదేనని తెలిపారు. మొదట మహానాడును నెల్లూరులో నిర్వహించాలని భావించినప్పటికీ, ఈసారి మరింత వైభవంగా క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. లోకేష్ నాయకత్వంలో పార్టీకి అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని, టెక్నాలజీని వినియోగించి గ్రామ, నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా మహానాడును వీక్షించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు ఐదు వేల మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొంటూ మహానాడును వీక్షిస్తున్నారని వెల్లడించారు. పొదుపు చర్యలతో పాటు పార్టీకి కొత్త దిశను చూపించే విధంగా మహానాడు నిర్వహిస్తున్నామని, నవశకానికి నాంది పలికే తొలి అడుగుగా ఈ మహానాడు నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈసారి “స్త్రీ శక్తి” నినాదంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యంగా మహానాడు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :