నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - జనవరి 14 : మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ శ్రీజ మహిళా ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో రెడ్డికోటలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం తో స్థానిక ప్రజలు పులకించిపోయారు. బుధవారం భోగి పండుగ సందర్భంగా తురకపల్లి క్లస్టర్ పరిధిలోని రెడ్డి కోట డైరీ ప్రాంగణంలో డైరీ మహిళా చైర్మన్ శ్రీదేవి సారధ్యంలో మహిళల రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని మన సంస్కృతి సాంప్రదాయ కోలాటాలు వేసి అలరించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీదేవి మాట్లాడుతూ మన హిందూ పండగలు మన సంస్కృతికి నిలువుటద్దమని వాటిని కొనసాగించి నేటి ఆధునిక సమాజానికి స్ఫూర్తి నివ్వాలన్నారు. సంక్రాంతి పండుగ వేళ పచ్చటి గ్రామ సీమల్లో ప్రకృతి వ్యవసాయతో పాడి పంటలు అభివృద్ధి చెంది పల్లె సీమల లోగిళ్లు సంక్రాంతి సంబరాలతో కళకళ లాడాలన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన మహిళలకు చైర్మన్ తో పాటు డైరెక్టర్ చంద్రకళలు మొదటి, ద్వితీయ బహుమతులుగా చీరలు, బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ మధుసూదన్, ఏరియా మేనేజర్ ఎర్రి స్వామి, శ్రీజ డైరీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
Reporter
Namitha News