నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 14 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్స్ మార్పు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, పలు మరమ్మత్తు పనులు చేపట్టి పరిష్కారం చేసినట్లు విద్యుత్ శాఖ ఎఈ సురేంద్ర తెలిపారు. ఉదయం నుండి వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా లైన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది మరమత్తు పనులు ముమ్మరంగా చేపట్టి పూర్తి చేశారు. విద్యుత్ వినియోగదారులు, రైతులు, వ్యాపారులు విద్యుత్ సమస్యలు తమ దృష్టికి తెస్తే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి కృషి చేస్తామని ఏ ఈ హామీ ఇచ్చారు. విద్యుత్తు అంతరాయం గుర్తించి సహకరించిన తంబళ్లపల్లె వినియోగదారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా పేరుపోయిన విద్యుత్ సమస్యలను సైతం పరిష్కారం చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
Reporter
Namitha News