నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 04 : ఆత్మకూరు పట్టణంలోని సిండికేట్ ఫార్మసీ సొసైటీ ప్రాంగణంలో నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ పరిటాల సత్యనారాయణ టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, బిజెపి నేత కుడుముల సుధాకర్ రెడ్డి ప్రారంభించగా ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పట్టణ బిజెపి అధ్యక్షులు నున్నా సంతోష్ కుమార్, జనసేన నేత జమ్మల ప్రసాద్, తెలుగుదేశం రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజ, రాష్ట్ర నాయకులు దావా పెంచలరావు, టిడిపి రూరల్ అధ్యక్షులు చౌదరి, విజయ భాస్కర్ రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు, రెండవ వార్డ్ కౌన్సిలర్ శివకోట రెడ్డి, రైతు నాయకులు లక్కు కృష్ణప్రసాద్, సొసైటీ కార్యాలయ మేనేజర్ శ్రీనివాసులు ఇతర సిబ్బంది రైతులు పాల్గొన్నారు.. రైతులు పంట వేయకముందే ఎరువులను అందించిన ఘనత కూటమి ప్రభుత్వాన్నిదని అలాగే పంట చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం తమ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా నేతలు తెలిపారు. తమ నేత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి రైతు సంక్షేమమే లక్ష్యంగా జిల్లాలో మొట్ట మొదటిసారిగా తన నియోజకవర్గం లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రైతుల నుండి ప్రతీ ధాన్యపుగింజ ను కొనుగోలు చేస్తామని రైతులకు ఆశించిన విధంగా గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడతామని రైతులు దళారుల మాటలు నమ్మి పంటను అమ్ముకోవద్దని సొసైటీ లోనే అమ్ముకోవాలని ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు
Reporter
Namitha News