Wednesday, 29 July 2026 04:56:22 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ విద్యార్థి రూపొందించిన గోసాత్ యూప్ ను ప్రారంభించిన ప్రిన్సిపాల్

గోసాత్ యూప్ అవిష్కర్త కలిచెర్ల వేణుమాధవ్ కు పలువురు అభినందనలు

Date : 09 April 2026 06:56 PM Views : 312

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 09 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) మూడవ సంవత్సరం చదువుతున్న కలిచెర్ల వేణుమాధవ్ ‘గోసాత్’ (Gosaath) పేరుతో ఒక వినూత్న రైడ్-షేరింగ్ మరియు వాహన అద్దె ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ అధికారికంగా ప్రారంభించారు. స్థానిక రవాణా అవసరాలను ఆధునీకరించే లక్ష్యంతో రూపొందించబడిన ఈ యాప్, ప్రయాణికులు మరియు డ్రైవర్లకు ఉపయోగపడేలా తక్కువ ఖర్చుతో కూడిన రూట్-మ్యాచింగ్ సదుపాయం, నమ్మకమైన రైడ్-ట్రాకింగ్ ఫీచర్లను అందిస్తుంది అని అన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా డ్రైవర్లు తమ ఖాళీ సమయాన్ని వినియోగించి అదనపు ఆదాయం పొందే అవకాశముండగా, ప్రయాణికులు తక్కువ ఖర్చుతో సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది. యూనివర్సిటీ స్థాయి నుండే ఇలాంటి సాంకేతిక పరిష్కారాన్ని అభివృద్ధి చేయడం యువతలో ఉన్న ఆవిష్కరణాత్మక ఆలోచనలకు నిదర్శనంగా నిలుస్తోంది అని అన్నారు. భవిష్యత్తులో ఈ యాప్‌ను మరింత విస్తరించి, కొత్త ఫీచర్లను జోడించి పెద్ద స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారని తెలిపారు. మరిన్ని వివరాల కోసం gosaath.com ను సందర్శించవచ్చు అని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సనత్ హేగ్దే, డీన్-అకాడెమిక్స్ డాక్టర్ రామ ఎస్ కొమరగిరి,విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పనా, డాక్టర్ చొక్కనాథన్ లు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణ చేసిన వేణుమాధవ్ ను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :