Tuesday, 14 April 2026 07:33:08 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

మహిళా వాకథాన్‌ లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మహిళా భద్రత మా ప్రథమ కర్తవ్యం

Date : 08 March 2026 06:31 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో ఆదివారం ఉదయం నిర్వహించిన 'మహిళా వాకథాన్' వేడుకలు అంబరాన్నంటాయి. మహిళా శక్తిని చాటేలా, వారి భద్రత పట్ల అవగాహన కల్పించేలా నిర్వహించిన ఈ భారీ ర్యాలీని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు మిషన్ కాంపౌండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మహిళలతో కలిసి అడుగులేసిన ఎస్పీ కేవలం జెండా ఊపి వాకథాన్ ను ప్రారంభించడమే కాకుండా, స్వయంగా ఎస్పీ గారు మహిళా పోలీసు సిబ్బంది, విద్యార్థినులు మరియు స్థానిక మహిళలతో కలిసి సుమారు 2 కిలోమీటర్ల మేర నడిచి వారిలో ఉత్సాహాన్ని నింపారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ వాకథాన్‌లో ఎస్పీ గారు మహిళల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళల నినాదాలతో మదనపల్లి వీధులు మార్మోగాయి. మహిళలను ఏడిపిస్తున్న ఆకతాయిలను ఎలా ఎదుర్కోవాలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు చేసిన నాటక ప్రదర్చన ఎంత గానో ఆకట్టుకుంది

మహిళా భద్రత మా ప్రథమ కర్తవ్యం అంటూ ర్యాలీ అనంతరం బి.టి. కళాశాల పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ గారు ప్రసంగిస్తూ సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే పోలీసు శాఖ నిరంతరం పని చేస్తోందని తెలిపారు. "మహిళలకు ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. "నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఏ శక్తినైనా అణిచివేసేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. శక్తి టీమ్స్, శక్తి యాప్ మరియు 112 నంబర్ సేవలను ప్రతి మహిళా వినియోగించుకోవాలి. మీ రక్షణ కోసం మేము నిరంతరం పహారా కాస్తాము." అని పేర్కొన్నారు.

విజేతలకు ప్రోత్సాహం బహుమతులు అందచేసిన ఎస్పీ ఈ వాకథాన్‌లో ఎంతో చురుగ్గా పాల్గొని లక్ష్యాన్ని చేరుకున్న మహిళలలో 10 మందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. వారికి జ్ఞాపికలను, బహుమతులను అందజేస్తూ, వారిలోని స్ఫూర్తిని కొనియాడారు. బహుమతులు అందుకున్న వారిలో విద్యార్థినులతో పాటు గృహిణులు కూడా ఉండటం విశేషం. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, పలువురు సీఐలు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, పెద్ద సంఖ్యలో మహిళలు పోలీసులు మరియు పట్టణ వాసులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :