Monday, 08 June 2026 08:26:56 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మహిళా వాకథాన్‌ లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మహిళా భద్రత మా ప్రథమ కర్తవ్యం

Date : 08 March 2026 06:31 PM Views : 263

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో ఆదివారం ఉదయం నిర్వహించిన 'మహిళా వాకథాన్' వేడుకలు అంబరాన్నంటాయి. మహిళా శక్తిని చాటేలా, వారి భద్రత పట్ల అవగాహన కల్పించేలా నిర్వహించిన ఈ భారీ ర్యాలీని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు మిషన్ కాంపౌండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మహిళలతో కలిసి అడుగులేసిన ఎస్పీ కేవలం జెండా ఊపి వాకథాన్ ను ప్రారంభించడమే కాకుండా, స్వయంగా ఎస్పీ గారు మహిళా పోలీసు సిబ్బంది, విద్యార్థినులు మరియు స్థానిక మహిళలతో కలిసి సుమారు 2 కిలోమీటర్ల మేర నడిచి వారిలో ఉత్సాహాన్ని నింపారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ వాకథాన్‌లో ఎస్పీ గారు మహిళల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళల నినాదాలతో మదనపల్లి వీధులు మార్మోగాయి. మహిళలను ఏడిపిస్తున్న ఆకతాయిలను ఎలా ఎదుర్కోవాలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు చేసిన నాటక ప్రదర్చన ఎంత గానో ఆకట్టుకుంది

మహిళా భద్రత మా ప్రథమ కర్తవ్యం అంటూ ర్యాలీ అనంతరం బి.టి. కళాశాల పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ గారు ప్రసంగిస్తూ సమాజంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే పోలీసు శాఖ నిరంతరం పని చేస్తోందని తెలిపారు. "మహిళలకు ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. "నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఏ శక్తినైనా అణిచివేసేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. శక్తి టీమ్స్, శక్తి యాప్ మరియు 112 నంబర్ సేవలను ప్రతి మహిళా వినియోగించుకోవాలి. మీ రక్షణ కోసం మేము నిరంతరం పహారా కాస్తాము." అని పేర్కొన్నారు.

విజేతలకు ప్రోత్సాహం బహుమతులు అందచేసిన ఎస్పీ ఈ వాకథాన్‌లో ఎంతో చురుగ్గా పాల్గొని లక్ష్యాన్ని చేరుకున్న మహిళలలో 10 మందిని ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. వారికి జ్ఞాపికలను, బహుమతులను అందజేస్తూ, వారిలోని స్ఫూర్తిని కొనియాడారు. బహుమతులు అందుకున్న వారిలో విద్యార్థినులతో పాటు గృహిణులు కూడా ఉండటం విశేషం. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు, పలువురు సీఐలు, ఆర్.ఐలు, ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, పెద్ద సంఖ్యలో మహిళలు పోలీసులు మరియు పట్టణ వాసులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :