Wednesday, 16 September 2026 02:01:21 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

మిట్స్ యూనివర్సిటీ లో సైబర్ నేరాలు, అరికట్టే పద్ధతులు పై చర్చలు, పరస్పర ఒప్పందాలు

ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హ్యాకర్స్ ఇన్ఫోటెక్, ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రప్రకాష్ శంకర్

Date : 06 November 2025 03:54 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 06 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ ) విభాగం వారు ఐఐఐసి వారి ఆధ్వర్యంలో ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనే అంశం పై హాండ్స్ ఆన్ వర్కుషాప్ ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హ్యాకర్స్ ఇన్ఫోటెక్, ఫౌండర్ అండ్ సీఈఓ చంద్రప్రకాష్ శంకర్, డీన్ స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్రప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి, డాక్టర్ మణికందన్ మరియు ఎమ్.శ్రీ లక్ష్మి ప్రీతీ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి చంద్రప్రకాష్ శంకర్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్ లో వ్యాపారాలు మరియు వ్యక్తులకు సంబంధించిన వివరాలు ఎన్నో ఉన్నాయని, వీటిని లక్ష్యంగా చేసుకుని రోజు రోజు కు సైబర్ దాడులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. పెరుగుతున్న సైబర్ దాడులకు, సున్నితమైన డేటాను రక్షించడానికి మరియు సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన ఆధునిక టెక్నాలజీలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ముక్యంగా సమస్యను అర్థం చేసుకొని వాటికి పరిష్కరాలను చేసేలా విద్యార్థులు ఎదగాలని ఆయన అన్నారు. డేటా ఉల్లంఘనలకు మానవ తప్పిదం ప్రధాన కారణం అని, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌లు మరింత అధునాతనంగా మారాయి అని ఆయన అన్నారు. సైబర్ దాడులు, డేటా లీక్‌లు, ఫిషింగ్, మాల్వేర్ వంటి ముప్పులను గుర్తించడం, వాటికి సమయానుకూలంగా స్పందించడం మరియు వాటిని అరికట్టే పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలకు ప్రభావితమైన సిస్టమ్‌లను నెట్‌వర్క్ నుండి వేరుచేయడం లేదా తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. కృత్రిమ మేధస్సు సైబర్‌ సెక్యూరిటీ రంగంలో సమయానుకూల ప్రతిస్పందన, ముప్పుల ముందస్తు గుర్తింపు మరియు డిజిటల్‌ భద్రత బలోపేతం చేయడంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది అని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీలుగా పరస్పర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: