నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పర్యావరణ హితమే పవనన్న పచ్చనిబాట లక్ష్యం - జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ స్పష్టం - మాలేపాడులో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం మదనపల్లె : పర్యావరణ హితమే పవనన్న పచ్చని బాట ముఖ్య ఉద్దేశ్యమని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,ఏపీఐఐసి డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ పేర్కొన్నారు.ఇందులో భాగంగా ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి మదనపల్లి రూరల్ మాలేపాడులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 51 శాతం గ్రీన్ కవర్ 2047లోపు సాధించాలని ఆశయంతో పనిచేస్తున్న తరుణంలో మా వంతు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా పవనన్న పచ్చని బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.అందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గం,మాలేపాడు గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం మూడు నెలలపాటు మదనపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు,మైఫోర్స్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈ మూడు నెలల్లో 2029 చెట్లు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను స్థానిక జనసేన నాయకులకి అప్పగించి నాటిన ప్రతి చెట్టు సంరక్షించబడేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.అలాగే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని తంబళ్లపల్లి,పుంగనూరు,పీలేరు,రాయచోటి నియోజకవర్గాలలో సైతం 2029 చెట్లు నాటి సంరక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.మదనపల్లి,తంబళ్లపల్లి,పుంగనూరు,పీలేరు,రాయచోటి నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు,సభ్యులు పవనన్న పచ్చనిబాటను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు అమరనారాయణ,జనసేన పార్టీ సీనియర్ నాయకులు సద్దికూటి హరినాథ్,మైఫోర్స్ అధ్యక్షుడు ఉమేష్,మైఫోర్ సుమన్ సింగ్,బసినికొండ శోభారాణి,మైఫోర్స్ డైరెక్టర్ సునీత,జనసేన సీనియర్ నాయకురాలు జయభవ్య,సింధు,మౌనిక జనసేన పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి ప్రసాద్,రమణ,మాలేపాడు జనసేన నాయకుడు సురేష్,సాంబశివ,రమణ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News