నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 22 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో డిప్యూటీ ఎంపీడీవో ఎంవి ప్రసాద్, కార్యదర్శి మహబూబ్ బాష ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ పై అధికారుల ర్యాలీ నిర్వహించారు. ఉదయం ఎంపీడీవో కార్యాలయం నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో పారిశుధ్యం పై దృష్టి సారించాలని, తడి పొడి చెత్త వేరు చేసి చెత్త వాహనంలో వేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తామని, వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగిస్తామని, పరిశుద్ధంపై అవగాహనకు సహకరిస్తానని ప్రమాణం చేయించారు . అనంతరం క్రాస్ రోడ్ లో మానవహారం ఏర్పడి స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ పై నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, హెల్త్ అసిస్టెంట్ కృష్ణా నాయక్, పద్మావతి, భాస్కర్, బాలు, జనసేన నాయకుడు ఎద్దుల నరసింహులు, బిజెపి కూటమి నాయకులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News