Friday, 19 June 2026 05:08:22 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలి

Date : 20 April 2026 08:28 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలి విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచించారు. సోమవారం స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపము నందు పాఠశాల 26వ వార్షికోత్సవ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు మొరుంపల్లి రజనిల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సహదేవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. ఉన్నత చదువులకు పోయే కొద్దీ సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగితే లక్ష్యాలను అధిగమించవచ్చునన్నారు. తమ పాఠశాలలో విద్యతోపాటు సామాజిక స్పృహ, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు,యోగ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. సీనియర్లు, జూనియర్లకు ప్రేరణగా నిలవాలన్నారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉపాధ్యాయులు బోధించే పాఠాలను చక్కగా అలవర్చుకొని,తల్లిదండ్రుల సూచనలు పాటించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. పాతికేళ్లుగా తమ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం గర్వంగా ఉందన్నారు. మా సుదీర్ఘ ప్రయాణంలో పాఠశాలాభివృద్ధికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు,కృషి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సహదేవ రెడ్డి, రజనిల నృత్యం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :