నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు -మే 05 : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం భీమ గాని పల్లి పంచాయతీ ఉలవలదిన్నె గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ కార్యకర్త అభిమాని గుర్రప్ప సోమవారం సాయంత్రం శివైక్యం చెందారు. సమాచారం తెలిసిన వెంటనే టిడిపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, గంగులప్ప, లక్ష్మీనారాయణ, గంగరాజు,సాతార్ల సుబ్రహ్మణ్యం, పూజారి సుధాకర్, గిరి, వెంకట్,భీమ గాని పల్లి రెడ్డి, నాగప్ప నాగరాజా వెంకటరమణ, సిద్ధప్ప, చెంగప్ప ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ పుంగనూరు మండలంలో టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి సీనియర్ కార్యకర్తగా అభిమానిగా గుర్రప్ప గారు పార్టీకి చేసిన కృషిని కొనియాడారు.ఎన్నికల సమయం లో పార్టీ బలోపేతానికి గ్రామం లోనె కాకుండా మండలం లో ఆయన మరెందరో కార్యకర్తలతో కలసి కృషి చేసారని,టిడిపి పార్టీ లో ఓ మంచి కార్యకర్తను కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందజెసి టిడిపి పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు
Reporter
Namitha News