నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 24 : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులకు మరియు ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఒక ప్రకటనలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం మరియు కరుణకు ప్రతీక అని పేర్కొన్నారు. లోక రక్షకుడైన యేసు క్రీస్తు జన్మదినాన్ని తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, సహనం మరియు త్యాగం వంటివి క్రీస్తు మానవాళికి అందించిన మహోన్నత సందేశాలని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మెలుగుతూ, ఎదుటివారిని క్షమించే గుణాన్ని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. క్రీస్తు బోధనలు సమాజంలో శాంతియుత జీవనానికి మార్గదర్శకాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.
Admin
Namitha News