Monday, 14 September 2026 09:32:38 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లెలో వైభవంగా లాక్మీ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభం

- హాజరైన మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా - ఘనస్వాగతం పలికిన యాజమానులు వెంకటేష్ బాబు,సౌజన్య

Date : 23 November 2025 11:42 AM Views : 222

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో వైభవంగా లాక్మీ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభం - హాజరైన మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా - ఘనస్వాగతం పలికిన యాజమానులు వెంకటేష్ బాబు,సౌజన్య మదనపల్లె : అన్నమయ్య జిల్లా,మదనపల్లి పట్టణంలో అధునాతన హంగులతో లాక్మీ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభించబడింది.శనివారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్,మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ముందుగా అతిథులకు అకాడమీ నిర్వాహకులు సత్రపాల వెంకటేష్ బాబు,సౌజన్యలు అపూర్వ స్వాగతం పలికి శాలువా,పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు మాట్లాడుతూ బెంగళూరు,చెన్నై,హైదరాబాద్ వంటి నగరాల వినూత్నమైన బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకునే యువతీ యువకులకు లాక్మి అకాడమీ చక్కని వేదిక అన్నారు.ఈ అకాడమీని ఏర్పాటు చేసిన వెంకటేష్ బాబు,సౌజన్యలను అభినందిస్తున్నామన్నారు.అకాడమీలో శిక్షణ తీసుకుంటే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.ఈ అవకాశాన్ని మదనపల్లి పరిసర ప్రాంతాలు యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం అకాడమీ నిర్వహకులు వెంకటేష్ బాబు,సౌజన్యలు మాట్లాడుతూ బ్యూటీ మరియు మేకప్ విభాగాలలో ఆసక్తి ఉన్నవారికి టాప్ మేకప్ ఆర్టిస్ట్ తో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందన్నారు.అదేవిధంగా ఇంటర్నషిప్స్,ప్లేస్మెంట్స్ లభించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.టాలెంటుని ప్రొఫెషనల్ కెరియరుగా మలుచుకునేందుకు ఇది గొప్ప అవకాశమన్నారు.మేకప్,స్కిన్,హెయిర్,కాస్మాటాలాజీ వంటి స్పెషలైజేషన్ కోర్సులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.రూ.10 వేల నుండి కోర్సులు ప్రారంభమవుతాయని,అకాడమీ ప్రారంభోత్సవ ఆఫరుగా కోర్సులపై 40% శాతం రాయితీ అందిస్తున్నట్లు వెల్లడించారు.మరిన్ని వివరాలకు అనిబిసెంట్ కూడలి,బెంగళూరు రోడ్డులోని లాక్మీ అకాడమీ,9992229149 అనే మొబైల్ నెంబరును సంప్రదించాలని కోరారు.మా ఆహ్వానం మేరకు హాజరైన మంత్రి,ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ గ్రాండ్స్ అధినేత సుధాకర్ రెడ్డి,టిడిపి నాయకులు మండిపల్లి మధుసూదన్ రెడ్డి,తమ్మిశెట్టి రామకృష్ణ,బాలమాలి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :