నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 06 : తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసి డిఎస్ సూపర్వైజర్ భారతి బాలింతలు, గర్భవతులకు తల్లిపాలే శ్రీరామరక్ష అని పుట్టిన బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు తాపించాలని సూచించారు. ఆరు మాసాల వరకు తల్లిపాలు అనంతరం ఉడికించిన మెత్తటి పదార్థాలు, రాగి జావ, మెత్తగా చేసిన కూరగాయల పండ్లు బిడ్డకు తినిపించడం ద్వారా తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ బ్రెస్ట్ క్యాన్సర్ రాకపోగా తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుకన్య, ఆశా కార్యకర్తలు, తల్లులు, గర్భవతులు పాల్గొన్నారు
Reporter
Namitha News