నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 21 : తంబళ్లపల్లె మండలం లో మహిళలు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సుచి శుభ్రత పాటించి వరలక్ష్మి అమ్మవారి ప్రతిమకు ప్రత్యేక పుష్పాలంకరణ, గణపతి పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, సాంబ్రాణి ధూపం, ధూప దీప నైవేద్యం, కర్పూర హారతులు, సమర్పించారు. అనంతరం చందన తాంబూలాలు, ప్రసాదాలు ముత్తయిదువులకు వాయినాలు సమర్పించి వరలక్ష్మి అమ్మవారిని సౌభాగ్యం తో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని మొక్కులు మొక్కుకొని ఆశీర్వాదాలు పొందారు. మల్లయ్య కొండ మహా శివాలయం, సాలెవీధి శివాలయం, కోసువారిపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం, కుక్కరాజుపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, రామాలయం, సాయిబాబా ఆలయాలలో మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతం నిర్వహించుకున్నారు
Reporter
Namitha News