నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పుంగనూరులోని MCV డిగ్రీ కళాశాలలో ఈ నెల 20వ తేదీన ‘జాబ్ మేళా–2026’ నిర్వహించనున్న సందర్భంగా రూపొందించిన పోస్టర్ను అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, వారి విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జాబ్ మేళాలో 10కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, 500కు పైగా ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులకు వేదిక వద్దే నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎస్ ఎస్ సి, ఐటిఐ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు కలిగిన ఫ్రెషర్స్తో పాటు అనుభవజ్ఞులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు
*జాబ్ మేళా వివరాలు:* తేదీ: 20 ఆగస్టు 2026 వేదిక: MCV డిగ్రీ కళాశాల, పుంగనూరు, అన్నమయ్య జిల్లా ఉద్యోగ ఖాళీలు: 500+ పాల్గొనే కంపెనీలు: 10+ అర్హతలు: ఎస్ ఎస్ సి / ఐటిఐ / డిప్లొమా / గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశం: ఉచితం ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశు , జిల్లా ఉపాధి అధికారి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ( డి.ఎస్.డి.ఓ ) తదితర అధికారులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో జాబ్ మేళాకు హాజరై, తమ విద్యార్హతలు మరియు నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను పొందాలని APSSDC జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. శ్యామ్ మోహన్ తెలిపారు
Reporter
Namitha News