నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూలై 13 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీహెచ్.డీ ప్రవేశాల ఇంటర్వ్యూలను జూలై 14 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. మిట్స్ డాట్ (MITSDAT)–జూలై 2026 పీహెచ్.డీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత తేదీ మరియు సమయానికి యూనివర్సిటీ ప్రాంగణంలో హాజరుకావాలని ఆయన సూచించారు. ఇంటర్వ్యూల షెడ్యూల్ జూలై 14, 2026 ???? సివిల్ ఇంజినీరింగ్ – ఉదయం 9:00 నుంచి 10:00 గంటల వరకు ???? మెకానికల్ ఇంజినీరింగ్ – ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు ???? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ – ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ???? కంప్యూటర్ సైన్స్ – మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జూలై 15, 2026 ???? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ – ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జూలై 16, 2026 ???? మేనేజ్మెంట్ స్టడీస్ – ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ???? ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్ – మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెండు సెట్ల స్వీయ ధ్రువీకరణ జిరాక్స్ ప్రతులు మరియు ఐదు పాస్పోర్ట్ సైజు రంగు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు
Reporter
Namitha News