నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గొప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట - వాటర్ మ్యాన్ కాదు - క్రెడిట్ చోరీ మ్యాన్ - వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ విమర్శలు మదనపల్లె : పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వైసిపి నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం కంటే,ఇతరులు నిర్మించిన ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తి క్రెడిట్ కొట్టేయడమే బాగా తెలుసన్నారు.వెలిగొండకు 1996లో శంకుస్థాపన చేసి తొమ్మిదేళ్లలో కేవలం రూ.10 లక్షలు ఖర్చు చేసిన చంద్రబాబు,ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు తన ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.వెలి గొండకు రూ.3,581.58 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చి,అసలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్ అని గుర్తు చేశారు.వైఎస్సార్ హయాంలోనే 20.333 కి.మీ సొరంగం పూర్తయితే,వైఎస్ జగన్ ప్రభుత్వం మిగిలిన 10.568 కి.మీ సొరంగాన్ని పూర్తిచేసి రెండు టన్నెల్స్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు.పోలవరం ఎడమ కాలువలో దాదాపు 79 శాతం పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని,అదే కాలువలో నీళ్లు వదిలి మొత్తం ఘనతను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం క్రెడిట్ చోరీ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు.సీఈఓ సీఎం నుంచి వాటర్ మాన్ అంటూ ఇంగ్లీష్ మీడియాలో డబ్బులిచ్చి ప్రచారం చేయించుకున్నంత మాత్రాన చరిత్ర మారదని,రికార్డుల్లో ఎవరు ఎంత పనిచేశారో ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు.పోలవరం ఎత్తు,నిర్వాసితుల పునరావాసం,ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి తేదీపై చంద్రబాబు ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రఘునాథ రెడ్డి,కార్యదర్శి వి.ఎస్ రెడ్డి,ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల మల్లికార్జున,యూనస్,సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News