నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 05 : తంబళ్లపల్లె మండల కేంద్రం నుండి కోసువారి పల్లి పంచాయతీ పరిధిలోని పాపనచెరువుపల్లె వరకు ఎనిమిది కిలోమీటర్లు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. అయితే తారురోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు పనులు ప్రారంభించే సుమారు 10 నెలలు కావస్తున్నా తారు రోడ్డు పనులు ప్రారంభించలేదు. అదేవిధంగా దయ్యాలవారిపల్లి, తంబళ్లపల్లి సమీపంలోని కృష్ణారెడ్డి బోరు వద్ద బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రోడ్డుపై కంకర తేలి పోవడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రయాణించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది
Reporter
Namitha News