Wednesday, 29 July 2026 04:54:30 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మాలేనత్తం లో స్వామిత్వ గ్రామసభ

Date : 21 November 2025 07:32 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 21 : రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామ పంచాయతీ సచివాలయంలో శుక్రవారం సర్పంచ్ కొండూరు శ్రీనాథ్ రెడ్డి అధ్యక్షతన మండల డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ ఏ గఫూర్ ఆధ్వర్యంలో స్వామిత్వ గ్రామసభ నిర్వహించడం జరిగింది.సర్పంచ్ కొండూరు శ్రీనాథ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ ఉంటానన్నారు, పంచాయతీ ఎదరయ్యే సమస్యలకు తక్షణమే స్పందిస్తానని, ప్రజావసరాల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాననీ హామీ ఇచ్చారు. గ్రామస్థులు కూడ తమ సమస్యలు అభిప్రాయాలను అధికారులు, ప్రజా ప్రతినిధులసమక్షంలో వెళ్ళడించారు. మాలేనత్తం టిడిపి యువ నాయకులు రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్,ఐటీ మంత్రి లోకేష్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని రాబోయే రోజుల్లో తన సొంత నిధులతో గ్రామ పంచాయతీ ని అభివృద్ధి చేస్తానని ఇటువంటి స్వామిత్వ పంచాయతీ రాజ్ గ్రామ ఈ గ్రామసభలో గ్రామ సభలు భవిష్యత్తులో గ్రామాభివృద్ధికి మార్గదర్శకాలు అవుతాయని గ్రామపంచాయతీ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తాన న్నారు. డిప్యూటీ ఎంపిడిఓ గఫుర్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని ఇంటి యజమానులకు వారి ఇంటి ఖాళీ స్థలము మరియు ఇంటి నిర్మాణంతో కొలతలు 9(2) తీసి నోటీసులు పంపిణీ చేసి వాటిలో గల కొలతలు సరిచూసుకొని ఏవైనా అభ్యంతరములు ఉంటే గ్రామసభలో రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. గ్రామ ప్రజలకు అభ్యంతరములను స్వీకరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గపూర్ పంచాయతీ సెక్రటరీ ఇర్ఫాన్,శ్రీనాథ్ రెడ్డి, రూపేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,శివారెడ్డి, మహేష్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :