నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 11 : తంబళ్లపల్లె మండలం లో అర్హులైన చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం మంజూరుకు సహకరించాలని చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు రేపన మల్లికార్జున బృందం ఎంపీడీవో ఉషారాణికి. వ్రాత మూలక ఫిర్యాదు చేశారు. మంగళవారం చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు మల్లికార్జున సుమారు 20 మంది కి చేనేత కార్మికుడిగా గుర్తింపు పొంది సొంత చేనేత మగ్గం వేసుకుంటున్నవారికి ఈమధ్య నేతన్న సేవలో భాగంగా నేతన్న భరోసా భరోసా నిధులు మంజూరు కాలేదు మంజూరు కాలేదని ఈ విషయమై చేనేత కార్మిక సంఘం తరఫున చేనేత శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయమై పార్టీలకు అతీతంగా అర్హులైన చేనేత కార్మికుల వివరాలు సేకరించి తమకు న్యాయం చేయాలని మంగళవారం చేనేత కార్మికులు ఎంపీడీవో ఉషారాణికి ఫిర్యాదు చేశారు. ఆమె వెంటనే స్పందించి అర్హులైన వారికి నేతన్న భరోసా అందడానికి తను వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మల్లికార్జున వెంట మండలంలోని అర్హులైన చేనేత కార్మికులు పాల్గొన్నారు
Reporter
Namitha News