నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 18 : ప్రతి మాదిగ కుటుంబం రాజ్యాంగ సృష్టికర్త దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో తమ బిడ్డలను కష్టపడి చదివించాలని ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్ లు సూచించారు. గురువారం రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మండలంలోని బాలిరెడ్డిగారిపల్లె దళితవాడ, గుండ్లపల్లి దళిత వాడల్లో మాదిగ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు చదువు యొక్క ఉపయోగాల పై అవగాహన కల్పించి నేటి ఆధునిక సమాజంలో చదువుతో విజ్ఞానంతో పాటు వికాసం, సమాజంలో గౌరవం, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరడానికి మూల కారణమని హితవు పలికారు. దళితవాడలోని ప్రతి విద్యార్థిని కచ్చితంగా బడికి పంపించి ఉన్నత చదువులు చదవడానికి మీరు సమిధలుగా మారి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. వారి వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత కుటుంబాల తల్లిదండ్రులు పాల్గొన్నారు
Reporter
Namitha News