Friday, 19 June 2026 03:14:38 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి

Date : 19 June 2026 08:30 AM Views : 15

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 18 : ప్రతి మాదిగ కుటుంబం రాజ్యాంగ సృష్టికర్త దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో తమ బిడ్డలను కష్టపడి చదివించాలని ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎద్దుల గంగాధర్ లు సూచించారు. గురువారం రాష్ట్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మండలంలోని బాలిరెడ్డిగారిపల్లె దళితవాడ, గుండ్లపల్లి దళిత వాడల్లో మాదిగ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు చదువు యొక్క ఉపయోగాల పై అవగాహన కల్పించి నేటి ఆధునిక సమాజంలో చదువుతో విజ్ఞానంతో పాటు వికాసం, సమాజంలో గౌరవం, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరడానికి మూల కారణమని హితవు పలికారు. దళితవాడలోని ప్రతి విద్యార్థిని కచ్చితంగా బడికి పంపించి ఉన్నత చదువులు చదవడానికి మీరు సమిధలుగా మారి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. వారి వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత కుటుంబాల తల్లిదండ్రులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :