నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 10 : పేద ప్రజలకు ఇంటి నీవేశ స్థలం పట్టాలు, ఇండ్ల నిర్మాణం కొరకు రుణాలు మంజూరు చేయాలని ఈనెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మహేష్ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప పిలుపునిచ్చారు ఎన్నికల ముందు సియం చంద్రబాబు, కూటమి నాయకులు గ్రామీణ పేదలకు మూడు సెంట్లు, పట్టణ పేదలకు రెండు సెంట్లు ఇంటి నివాస స్థలాలు ఇస్తామని ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు రుణం ఇస్తామని, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచారని, నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్పులు మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయుటకు సీపీఐ పార్టీ ఆదేశాల మేరకు ధర్నా కు పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు తదితరులు హాజరవుతారని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతటి చెప్పుకుంటూ పేదల ద్రోహిదా తయారయిందని రాష్ట్రంలో అక్రమ పెన్షన్ల పేరుతో ఏడు లక్షల పెన్షన్లు తొలగించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటిదాకా పేదలకు ఒక్క ఇంటి పట్టా గాని ఒక ఇంటి నిర్మాణం గానీ జరగలేదని ఇది మాటల కార్య ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదని సూపర్ సిక్స్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం రీ సర్వే రద్దు చేస్తామని అలాగే ఆధాని కంపెనీ బోర్ మోటార్లకు ఇంటి మీటర్లకు స్మార్ట్ మీటర్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి హామీని తుంగలో దక్కడం జరిగిందని గత ప్రభుత్వంలో జగనన్న పట్టాలు పేదలకు ఇచ్చారని వాటికి స్థలాల చూపు లేదని వాటిని రద్దు చేసి ఆన్లైన్ చేసి ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న జరుగు ధర్నాను జయప్రదం చేయాలని ఈ ధర్నా కార్యక్రమంలో గత ప్రభుత్వంలో జగనన్న పట్టాలు పొందిన లబ్ధిదారులు పెన్షన్ రాని లబ్ధిదారులు భూ సమస్యలు ఉన్న బాధ్యతలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ మనోహర్ రెడ్డి కే మురళి పిఎల్ వెంకటేష్ సూరి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News