Wednesday, 29 July 2026 12:44:07 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రామసముద్రం యువతి బెంగళూరు లో హత్య

Date : 24 November 2025 07:49 PM Views : 293

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 24 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారి పల్లె కు చెందిన యువతి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో హత్యకు గురైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివారాల మేరకు చొక్కాండ్లపల్లె గ్రామపంచాయతీ భిక్కింవారి పల్లెకు చెందిన రెడ్డెప్ప రెండవ కుమార్తె దేవిశ్రీ 21 పై చదువులు కోసం కర్ణాటక బెంగళూరులోని ఓ ప్రవేట్ కాలేజీలో బిబిఎం చదువుతూ పెయింగ్ గెస్ట్ హాస్టల్ లో ఉంటోంది. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రి గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ్ వర్ధన్ ఆదివారం బెంగళూరు వెళ్లి దేవిశ్రీ స్నేహితురాలు రూముకు దేవిశ్రీ ని పిలిపించుకున్నాడు. వీరి ఇద్దరినీ రూములో వదిలి స్నేహితురాలు వెళ్ళిపోయింది. దేవిశ్రీ , ప్రేమ్ వర్ధన్ మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని ప్రేమ్ వర్ధన్ దేవిశ్రీ ముఖముపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి దేవిశ్రీ నీ చంపేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న దేవిశ్రీ కుటుంబసభ్యులు బెంగళూరు వెళ్లి అక్కడి పోలీసులకు సమాచారం అందించి కేసు నమోదుచేయించారు. దేవిశ్రీ పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. జీవనోపాది కోసం పై చదువులకు వెళ్లిన కూతురు జీవక్షవంలా తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలం కర్ణాటక కావడంతో ఏ పి హోం మంత్రి చొరవ తీసుకొని తన కూతురుకు పట్టిన గతి వేరొకరికి పట్టకుండా నిందితున్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని దేవిశ్రీ తల్లిదండ్రులు కోరుతున్నారు

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: