నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 15 : నెల్లూరు జిల్లాలో లక్ష ఉద్యమి సభ్యత్వాల నమోదు కోసం కృషి చేయాలి జనసేన రాష్ట్ర నాయకులు టిడ్క్ హౌసింగ్ రాష్ట్ర చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 50 వేల పైచిలుకు ఉద్యమి సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంఖ్యను లక్షకు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని సూచించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం సాగించాలనే ఉద్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని “ఉద్యమి”గా పిలుస్తూ, సమాజంలో మార్పు కోసం సమ సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమకారులుగా ముందుకు రావాలని ఆయన కోరారు.
Admin
Namitha News