Thursday, 30 July 2026 08:27:52 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మాజీ సీఎం జగన్ పై అసత్య ఆరోపణలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోండి - వైకాపా నాయకులు పోలీసులు ఫిర్యాదు.

Date : 09 April 2026 07:14 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 09 : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఏబీఎన్ ఛానల్ లో అసత్య ఆరోపణలు చేసిన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకులు గురువారం ఎస్సై టి అనిల్ కుమార్ లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఉదయం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర ఆధ్వర్యంలో నాయకులు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసిన నిరాధార అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా వ్యక్తిత్వాన్ని హరించి ఉద్దేశపూర్వకంగా అవమాన పరిచే విధంగా వీకెండ్ కామెంట్స్ లో రాధాకృష్ణ ప్రజలను పక్క దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా మహిళలను ఓ వస్తువుగా వారి వ్యక్తిత్వం, గౌరవం సామాజిక స్థాయిని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడు9 జర్నలిజానికి నిదర్శనం అన్నారు. వైకాపా కార్యకర్తలను బుద్ధిలేని వారిగా పిచ్చి వాళ్ల సమూహంగా అభివర్ణించడం హేయమైనా చర్యగా దుయ్యబట్టారు. మా నాయకుడు జగన్ తో పాటు పార్టీని మహిళలను కించపరిచే విధంగా డిబేట్లో మాట్లాడిన ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ, ఎడిటర్, సంబంధిత సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైకాపా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :