నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 04 : మదనపల్లి నియోజకవర్గం లోని పొన్నేటిపాళ్లెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జయరాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన సందర్బంగా హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, మరియు సీడ్ మల్లికార్జున పాల్గొని జయరాంకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆ దేవదేవుని ఆశీస్సులతో మరెన్నో పుట్టినరోజులు జరుకోవాలని, టీడీపీ కార్యకర్తల కోసం పనిచేస్తూ ఉన్నత పదవులను అధిరోహించాలని శ్రీరామ్ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మంజునాథ్ రెడ్డి, జే.సీ. రెడ్డెప్ప, ప్రభు గౌడ్, బండి అమర, శ్యామ్, ఫటాన్ ఖాన్, మరియు జనసేన నాయకురాలు మల్లిక బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ కిరణ్, జనార్ధన్, మంజునాథ్ రావ్, దిలీప్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News