నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 15 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ ఏనుగు మల్లమ్మ ఆలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేసిన చౌడ సముద్రం ఈశ్వర రెడ్డి ని బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి, గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డిలు ప్రశంసించారు. ఆదివారం వారు మల్లయ్య కొండ సందర్శనలో భాగంగా చలివేంద్రంలో సేద తీరారు. అనంతరం మల్లయ్య కొండ మహాశివుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారి వెంట మండల టిడిపి అధ్యక్షుడు వెంకటరమణ, మాజీ అధ్యక్షుడు రామస్వామి రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News