నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రూపొందించిన వినూత్న ‘కోర్టు మానిటరింగ్ సిస్టమ్’ (CMS) ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జైపూర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ‘టెక్నాలజీ సభా ఎక్సలెన్స్ అవార్డ్స్–2026’ను ఎస్పీ అందుకున్నారు. CMS ద్వారా కోర్టు కేసులు, నిందితుల వివరాలు, కేసుల స్థితి, కోర్టు సమన్లు, వారెంట్ల ప్రక్రియను డిజిటలైజ్ చేశారు. దీంతో కేసుల పర్యవేక్షణ మరింత సులభమై, విచారణ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు నేరస్థులకు సకాలంలో శిక్షలు పడేలా వ్యవస్థ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు
Reporter
Namitha News