Sunday, 13 September 2026 05:40:09 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పుంగనూరు INTACH చాప్టర్ కన్వీనర్ -కో కన్వీనర్ ల నియామకం

Date : 26 June 2026 01:59 PM Views : 119

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారతదేశ సాంస్కృతిక, చారిత్రక, ప్రకృతి వారసత్వ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న INTACH (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) (భారత జాతీయ కళా సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ) సంస్థ, పుంగనూరు చాప్టర్ కి సరుం మహీపాల్ రెడ్డి గారిని కన్వీనర్, చిట్టిమిరెడ్డి భాస్కర్ రెడ్డి ని కో-కన్వీనర్ నియమించింది.ఈ మేరకు INTACH కేంద్ర కార్యాలయం,న్యూఢిల్లీ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ సరుం మహీపాల్ రెడ్డి మాట్లాడుతూ,తమపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన INTACH కేంద్ర కార్యాలయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరు ప్రాంతంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు,చెరువులు,శిలాశాసనాలు, సాంప్రదాయ కళలు మరియు సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కో-కన్వీనర్ చిట్టిమిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ,ఈ గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించిన INTACH కేంద్ర కార్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కన్వీనర్తో కలిసి వారసత్వ పరిరక్షణ, విద్యార్థుల్లో అవగాహన, యువత భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నియామక ప్రక్రియలో విశేష సహకారం అందించిన కె. చిన్నపరెడ్డి, INTACH కడప చాప్టర్ కన్వీనర్ మరియు INTACH గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు & ఓ. వెంకటేశ్వర రెడ్డి (INTACH కడప సభ్యులు) మరియు ఈ నియామక ప్రక్రియలో డా. శరణ్ కుమార్ రెడ్డి, త్రిమూర్తి రెడ్డి,సుధాకర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి తదితరులు సభ్యులుగా అందించిన సహకారం విశేషమైనది. వీరికి నూతన నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.పుంగనూరు చాప్టర్ ద్వారా హెరిటేజ్ వాక్స్, పాఠశాలలు మరియు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు,చారిత్రక కట్టడాల డాక్యుమెంటేషన్, సంప్రదాయ కళల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు, విద్యార్థులు,చరిత్రాభిమానులు, స్వచ్చంద సంస్థలు మరియు ప్రభుత్వ శాఖలు INTACH కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :