Monday, 14 September 2026 08:00:55 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం జిమాక్స్ -2K26

Date : 02 April 2026 05:22 PM Views : 192

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 02 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగము వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం జిమాక్స్ -2కే26 (GMOCS-2K26) కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమెల్డా బానుమతి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ – లెర్నింగ్ & డెవలప్మెంట్, మొవేట్, చెన్నై పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పరిశ్రమలో విజయం సాధించాలంటే కేవలం సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే సరిపోదని, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ కూడా అత్యంత అవసరమని అన్నారు. నూతన టెక్నాలజీ పై ఆవిష్కారణలు చేయాలనీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు చిన్న చిన్న సంస్థలు ప్రస్తుతం ఉన్న నూతన టెక్నాలజీ లో మెరుగైన పరిశోధనలతో నూతన ఆవిష్కరణలను చేస్తున్నాయని విద్యార్థులు వాటి పై ద్రుష్టి పెట్టాలని అన్నారు. జనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూనే, నైతిక విలువలతో కూడిన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు. నేటి ప్రపంచంలో మనం చూస్తున్న వేగవంతమైన పురోగతి వెనుక సాంకేతికతలో ఆవిష్కరణలు, పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చడం, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం మొదలైనవి సాంకేతిక ఆవిష్కరణ పురోగతికి మూలస్తంభంగా చెప్పుకోవచ్చు అని అన్నారు. సాంకేతిక ఆవిష్కరణ అనేది సామర్థ్యాన్ని పెంచి, సమస్యలను పరిష్కరించే విధంగా కొత్త అవకాశాలను సృష్టించేదని అన్నారు. సంచలనాత్మక ఆవిష్కరణలకు మాత్రమే పరిమితం కాకుండా ఇప్పటికే ఉన్న సాధనాలు, సిస్టమ్‌లు మరియు ప్రక్రియలకు పెరుగుతున్న మెరుగుదలలను టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రభావితం చేస్తాయని అన్నారు. నూతన టెక్నాలజీలపై అవగాహనపెంచుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రసంశ పాత్రలను మరియు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్–స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎమ్ శ్రీదేవి, కోఆర్డినేటర్ డాక్టర్ డి జె ఆష్పిం పబి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :