నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 02 : ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంటులో బిల్లు ఆమోదించబడిన సందర్భంగా సంఘీభావ ర్యాలీ జరిగింది. గురువారం సాయంత్రం మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. క్రాస్ రోడ్డు నుండి తంబళ్లపల్లె పురవీధుల్లో జాతీయ జెండాతోపాటు టిడిపి, కూటమి పతాకాలతో జై అమరావతి, జై జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వెంకట్ రెడ్డి, పురుషోత్తం,కాల నారాయణ, నరసింహులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మాజీ ఉపసర్పంచ్ మణి,వీరాంజనేయులు, మాజీ ఉపసర్పంచ్ సోమశేఖర్, మ్యూజికల్ శివ, పెద్ద వీరభద్ర, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున, నరసింహనాయుడు, మధు నాయుడు,మాజీ సర్పంచ్ సుధాకర్, వికలాంగుల సంఘం అధ్యక్షుడు రామాంజులు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, కార్యదర్శి శ్రీనివాసరావు, ఐసుల కిట్ట, ఓటమి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News