నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 29 : తంబళ్లపల్లె లోని టిఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటిఐ లో జూన్ ఒకటో తేదీన నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎనిమిది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని ఆసక్తిగల నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని ప్రిన్సిపాల్ నాగరాజు ప్రకటనలో కోరారు. ఈ జాబ్ మేళాలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, సివిల్ అవుట్ గోయింగ్ విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు మరియు గతంలో ఐటిఐ పాస్ అయిన విద్యార్థులు ఉంటే మరియు పాలిటెక్నిక్ పాస్ అయిన విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఉద్యోగ అవకాశం కోసం ఒకటో తేదీ 10 గంటలకు ఐటిఐ లో సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేసి ఆఫర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు
Reporter
Namitha News