Wednesday, 29 July 2026 08:17:13 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

కోసువారిపల్లె లో ఐదు లక్షలతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు

ఒకప్పుడు గుక్కెడు నీటికి కటకట - నేడు కూటమి సర్కార్ స్వచ్ఛ తాగునీరు

Date : 05 July 2026 10:48 AM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 04 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె లో దశాబ్దాలుగా తాగునీటి కోసం మహిళలు కటకట లాడిన రోజులు గడిచిపోయాయి. నేడు కూటమి ప్రభుత్వం రాకతో టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ బేరిపల్లి శ్రీనివాసులు టిడిపి అధిష్టానానికి సమస్య తెలిపి తద్వారా జిల్లా పరిషత్ నుండి ఐదు లక్షల నిధులు మంజూరు చేయించారు. కోసువారిపల్లి పాత పంచాయతీ కార్యాలయంలో2000 లీటర్ల సామర్థ్యంతో ఆర్డబ్ల్యూఎస్ డిఈ చంద్రశేఖర్ రెడ్డి, ఎఈఈ వినోద్ కుమార్ ల సహకారంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి గడపకు కేవలం రూ 2 బిందె తాగునీరు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బేరి శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో సర్పంచిగా తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి పడరాని పాట్లు పడ్డామని అయితే నేటి కూటమి ప్రభుత్వం సహకారంతో ఈ ఆరో ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి మహిళ తాగునీరు కష్టం పడరాదని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కోసువారి పల్లి పంచాయతీ తాగునీటితోపాటు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు, తాగునీటి పనులు, పలు అభివృద్ధి పనులకు స్థానిక టిడిపి తోబాటు కూటమి నేతలు తనకు పూర్తి సహకారం అందించారని కొనియాడారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :