నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వేసవి ఊరటగా సేవతో పాటు -బహుమతులు అందజేత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొలమాసనపల్లి గ్రామంలో వేసవిలో చిన్నారులకు సేద తరగతుల రెవరెండ్ కుప్పుస్వామి శైల ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు చర్చి ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యవ్వనస్తులు చిన్నారులు పెద్దలు కలిసి వేసవి సెలవులు పురస్కరించుకొని, ఎండలకు వడదెబ్బకు లోను కాకుండా ఆలోచన విధానాన్ని జ్ఞానంగా మార్పు విధానంలో, దేవుడు చేసినటువంటి మేలులు పేదలకు ఆయన పెన్నిధిగా ఎలా ఆశ్రయంగా ఉన్నాడు అనే కోణంలో మంచి దృక్పథముతో విజ్ఞానవంతులు కావాలని అందరికీ పలు సూచనలు చేశారు. స్థానికంగా ఉన్న గ్రామస్తుల సహాయ సహకారాలు అందించారు. మూడు రోజులు పాటు జరిగిన సిబిసి తరగతులలో పొందునంతగా ఆనందం, వారికి ప్రోత్సాహంగా కూడి వచ్చిన ప్రతి ఒకరికి చర్చ్ ఎల్దర్ కుటుంబం టి. భూలక్ష్మి మునిరత్నం అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వాసులు, యవ్వనస్థులు చిన్నారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News