నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 28 : అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో లక్షలాది మంది భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా, స్థానిక ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం అక్రమంగా తలపెట్టదలచిన మైనింగ్ కి వ్యతిరేకంగా ఉద్యమానికి బీసీవై పార్టీ సిద్ధం. రాయలసీమ జిల్లాలో శ్రీశైలం శ్రీకాళహస్తి తర్వాత అంత విశిష్టంగా పేరుందిన మల్లయ్య కొండ శైవ క్షేత్రం జోలికి వస్తే మాడి మసైపోతారు. ఐరన్ ఓర్ మైనింగ్ పేరుతో మల్లయ్య కొండ లో గుణపం దింపితే ఆ శివయ్య చూస్తూ ఊరుకోడు. సాదుకొండ ఇనుముకొండ మల్లయ్య కొండ సముదాయంగా ఉన్న మల్లయ్య కొండ లో ఐరన్ ఓర్ వెలికితీయడానికి TDP ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. లేదంటే బీసీవైపి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాల్సి ఉంటుంది. 08-07-2026 (సోమవారం) .శివ భక్తులతో కలిసి బీసీవై పార్టీ మల్లయ్య కొండ పరిరక్షణకు నడుము బిగించనుంది. 6, 700 హెక్టారలో విస్తరించి ఉన్న మల్లయ్య కొండ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పటికే సాదుకొండ చిన్నరకొండ ప్రాంతాలలో 1550 హెక్టార్లలో కూటమి ప్రభుత్వం మైనింగ్ కోసం ఏపీ కన్జాభివృద్ధి సంస్థకు ఇచ్చిన లైసెన్స్ ను వెనక్కు తీసుకొని ముక్కంటికి క్షమాపణలు కోరకపోతే బిసివైపి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమవుతోంది. నాడు మల్లయ్య కొండ సముదాయంలోని సాదుకొండలో మైనింగ్ కు వ్యతిరేకంగా గళం విప్పిన చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రి గా మల్లయ్య కొండ సముదాయంలోని సాదుకొండలో మైనింగ్ కు పచ్చ జెండా ఊపడం విస్తు గొలుపుతోంది. మరోవైపు సనాతన ధర్మం హిందూ ధర్మం అని ప్రతి రోజు ఊదరగొట్టే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు కొండల్లో కొలువై ఉన్న ముక్కంటికి కీడు తల పెడుతుంటే ఆయన మౌనం పాటిస్తుండడం దేనికి సంకేతమో ఆయనే సెలవివ్వాలి .ఈ అరాచకాలను ఆ మల్లయ్య కొండపై కొలువుదీరిన శివయ్య ఆశీర్వాదంతో బీసీవైపి అడ్డుకోవడానికి ముందుకు వస్తోంది
Reporter
Namitha News