నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 01 : తంబళ్లపల్లి మండలంలో గురువారం సాయంత్రం నుండి గాలి వాన బీభత్సం సృష్టించి పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి ఇన్సులేటర్లు దెబ్బతిని విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అంతరాయాన్ని ముందస్తుగా గుర్తించిన విద్యుత్ శాఖ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి విద్యుత్ శాఖ ఏ ఈ సురేంద్ర తన సిబ్బందితో విద్యుత్ అంతరాయం, ఎక్కడ సమస్యలు ఏర్పడ్డాయి గుర్తించి హుటాహుటిన నివారణ చర్యలు చేపట్టారు. గోరంకొండ సబ్ స్టేషన్ నుండి తంబళ్లపల్లె మండలానికి సరఫరా జరిగే విద్యుత్ లైన్ లో నాలుగు ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి, అదేవిధంగా పంచాలమర్రి వద్ద 11 కేవీ విద్యుత్ స్తంభం ఈదురు గాలులకు విరిగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ మరమతుల్లో భాగంగా విద్యుత్తు శాఖ లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్, జేఎల్ఎం ప్రసాద్, అమీద్, ఏఎల్ఎంలు అనంత్, శ్రీకాంత్, ఇంతియాజ్, శేషు, నాగేంద్ర, ఖాద్రి, సురేష్, డ్యూటీ ఆపరేటర్లు భాస్కర్, రాజశేఖర్, మధు లు గుర్రంకొండ సబ్ స్టేషన్ నుండి కన్నెమడుగు, గోపిదిన్నె సబ్ స్టేషన్ ల వరకు శుక్రవారం విద్యుత్ మరమ్మత్తు పనులు శరవేగంగా నిర్వహించి పనులు పూర్తి చేయడంతో విద్యుత్ సరఫరా కొనసాగడానికి సులభతరమైంది
Reporter
Namitha News