నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 12 : తిరుపతిలో జరిగిన కూటమి విజయోత్సవ ర్యాలీకి తంబళ్లపల్లి మండలం నుండి మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ పిలుపుతో మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయం తంబళ్లపల్లె మండల కేంద్రంలో తిరుపతి వెళ్లే వాహనాలకు రెడ్డప్ప రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రెండు బస్సులు, పాతిక వాహనాలలో టిడిపి జిందాబాద్, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర, గంగుల్ రెడ్డి, పురుషోత్తం, నరసింహులు, సురేంద్ర, రామచంద్రారెడ్డి, సుధాకర్, బాలకృష్ణారెడ్డి, రామలింగారెడ్డి, వీరాంజనేయులు, రషీద్ భాష, గోపి దీన్ని సుధాకర్, రామకృష్ణ,పంచాలమర్రి శంకర, మాధవ రెడ్డి, సామి రెడ్డి, నరేంద్ర నాయుడు, రామాంజులు, సీను కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News