Saturday, 12 September 2026 06:23:11 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం - పంట నష్టం

విద్యుత్ హెవీ లైన్ వైర్లు క్రింద నే ఉండటం తో తరచూ దగ్ధం అవుతున్న తోట - బిజెపి కిసాన్ మోర్చా

Date : 10 May 2026 10:19 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / అనంతపురం : నార్పల - మే 10 : అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీధర్ గారు అరటి పంట సాగు చేసి సంవత్సరం పైగా కష్టపడి పెంచి చేతికి వచ్చిన పంట , విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాలుగు సార్లు పంట కాలిపోయి రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లింది. వెంకటం పల్లి నుండి మడుగుపల్లి వరకు దాదాపు 250 ట్రాన్స్‌ఫార్మర్లకు వెళ్లే విద్యుత్ లైన్‌కు చాలా చిన్న వైర్లు ఉపయోగించడం వల్ల తరచూ వైర్లు కాలిపోతున్నాయని రైతులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు. సమస్య తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతు తీవ్రంగా నష్టపోయాడని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కడపం దామోదర్ గారు మండిపడ్డారు. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యుత్ అధికారుల వైఖరి వెంటనే మారకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతుకు జరిగిన పూర్తి నష్టాన్ని అంచనా వేసి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులైన AE, AD అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు పంటలు కాలిపోతుంటే కార్యాలయాల్లో కూర్చుని నిర్లక్ష్యం చేసే అధికారులను ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, SC మోర్చా మండల అధ్యక్షులు గంగాధర్ , మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :