Wednesday, 29 July 2026 09:12:02 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం - పంట నష్టం

విద్యుత్ హెవీ లైన్ వైర్లు క్రింద నే ఉండటం తో తరచూ దగ్ధం అవుతున్న తోట - బిజెపి కిసాన్ మోర్చా

Date : 10 May 2026 10:19 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / అనంతపురం : నార్పల - మే 10 : అనంతపురం జిల్లా నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీధర్ గారు అరటి పంట సాగు చేసి సంవత్సరం పైగా కష్టపడి పెంచి చేతికి వచ్చిన పంట , విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాలుగు సార్లు పంట కాలిపోయి రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లింది. వెంకటం పల్లి నుండి మడుగుపల్లి వరకు దాదాపు 250 ట్రాన్స్‌ఫార్మర్లకు వెళ్లే విద్యుత్ లైన్‌కు చాలా చిన్న వైర్లు ఉపయోగించడం వల్ల తరచూ వైర్లు కాలిపోతున్నాయని రైతులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు. సమస్య తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతు తీవ్రంగా నష్టపోయాడని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కడపం దామోదర్ గారు మండిపడ్డారు. రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యుత్ అధికారుల వైఖరి వెంటనే మారకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతుకు జరిగిన పూర్తి నష్టాన్ని అంచనా వేసి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులైన AE, AD అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు పంటలు కాలిపోతుంటే కార్యాలయాల్లో కూర్చుని నిర్లక్ష్యం చేసే అధికారులను ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, SC మోర్చా మండల అధ్యక్షులు గంగాధర్ , మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: