Tuesday, 15 September 2026 10:41:41 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మామిడి రైతులను గత ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసింది - టీడీపీ నేతల విమర్శలు

Date : 01 July 2026 06:25 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు జూలై 01 : పుంగనూరు స్థానిక మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుధవారం మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామిడి రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని వారు అన్నారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శమీపతి యాదవ్ మాట్లాడుతూ..గత ఏడాది మామిడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.190 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రైతులకు కిలో మామిడిపై రూ.4 సబ్సిడీ అందిస్తున్న విషయాన్ని పెద్దిరెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో చౌడేపల్లి, సోమల, దామలచెరువు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న మామిడి మండీలను బలవంతంగా తొలగించారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు సమీపంలోనే మామిడి మార్కెట్లను ఏర్పాటు చేసి, తమ పంటకు మెరుగైన ధర లభించేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మామిడి రైతులకు అన్యాయం చేసింది ప్రస్తుత ప్రభుత్వం కాదని, గత ప్రభుత్వమే రైతుల ప్రయోజనాలను విస్మరించిందని టీడీపీ సీనియర్ నాయకులు మాధవరెడ్డి,సి.వి.రెడ్డి పేర్కొన్నారు. ఇకనైనా మామిడి రైతులను తప్పుదోవ పట్టించేలా అసత్య ఆరోపణలు,ధర్నాలు, రాస్తారోకోలు, తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వారు సూచించారు. వాస్తవాలు ప్రజలకు తెలుసని, ఇటువంటి రాజకీయ ఆరోపణలను ప్రజలు విశ్వసించరని వారు స్పష్టం చేశారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: